రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం వేరుశెనగలో తామర పురుగుల వలన మొవ్వుకుళ్ళు తెగులు వ్యాపిస్తుంది. పైరు లేత దశలో తామర పురుగు ఆశించి రసంను పిలుస్తాయి. ఈ తెగులు ఆశిస్తే మొక్కలు కురచబడి ఎక్కువ రెమ్మలు వస్తాయి. ఆకులు చిన్నవిగా మారి మొవ్వు ఎండిపోతుంది. నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా ఫిప్రోనీల్ 2 మీ.లీ లేదా డైమిథోయేట్ 2 మి.లీ లీటరు నీటిలో కలిపి ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణాన్నిపిచికారి చేయాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||