పాడి రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా పశు సంవర్ధక శాఖ వారు సంయుక్తంగా అందించుచున్న సమాచారం: వేసవికాలంలో పశువులలో జీర్ణప్రక్రియ సన్నగిల్లుట వలన సులువుగా జీర్ణమయ్యే హంజీ, జావ లాంటి పధార్థాలు ఇవ్వడం మంచిది. పశువులకు ఉదయం పూట పచ్చి గడ్డిని మరియు సాయంత్రం వేళల్లో ఎండుగడ్డిని అందించాలి. పాలను ఇచ్చే పశువులకు దాణాను నీటితో కలిపి ఇవ్వడంతో పాటు ఖనిజ లవణ మిశ్రమం ఉప్పు కలిపిన ద్రావణాలను ఇవ్వాలి. ఎండ సమయంలో పశువులు మురుగు నీరు త్రాగకుండా చూసుకోవాలి. వాటికి శుభ్రమైన నీరు అందించాలి. పశువులను మేతకు ఎండ సమయంలో కాకుండా ఉదయం మరియు సాయంత్రం వేళల్లో తీసుకెళ్లాలి.
Comment | Author | Date |
---|---|---|
Be the first to post a comment... |
Copyright © 2025 Reliance Foundation. All Rights Reserved.