పాడి రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్తం గా అందించుచున్న సమాచారం:పశువులకు బ్రూసిల్లా వ్యాధి సొకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఆవులు లేక గేదెలు ఈను కాలంలో పరిశుభ్రం అయిన ప్రాంతాలలో ఉంచాలి. పశువుల మందలోని పశువులకు బ్రూసిల్లా వ్యాధి పరీక్ష చేయాలి. పశువుల మందలో ఎక్కువ శాతం (5%) వ్యాధి కలిగిన పశువులు ఉన్నపుడు 6-8 నెలలు మధ్య వయస్సు గల ఆడ పెయ్యలన్నిటికి కాఫ్ హుడ్ టీకాలను వేయించాలి. వ్యాధి నిరోధక శక్తికి గాను ఆరోగ్యకరమైన పశువులకు కూడా టీకా మందు వేయించాలి. ఈ వ్యాధి సోకిన పశువుల పాల నుండి వ్యాధి క్రిములు మనుషులలో వ్యాధిని కలుగ చేయును. ఈ సమాచారం అందించిన వారు జిల్లా పశుసంవర్ధక శాఖ.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved.