రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రస్తుత వాతావరణ పరిస్తితులలో వరిలో బాక్టీరియా ఆకు ఎండు తెగులు ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులు అంచులు క్రమంగా ఎండిపోతాయి. ఈ తెగులు ఆశించిన పొలంలో నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా బయటికి మురుగు నీటి కాలువల ద్వారా పంపాలి. పొటాష్ ఎరువును నాటే ముందు అంకురం ఏర్పడే దశలో ఎకరాకు 15-20 కిలోల చొప్పున వేసుకోవాలి. నివారణకు ప్లాంటోమైసిన్ 0.2 మిల్ లేదా పోశోమైసిన్ 0.2 గ్రా లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved.